తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్...?

కరోనా పరిస్థితి నేపధ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి. టీటీడీ అధికారులు ఏర్పాట్లు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నడక మార్గం మీద దృష్టి పెడుతున్నారు. అలిపిరి నడక మార్గంను అధికారులు మరో రెండు నెలలు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నడక మార్గంలో ప్రస్తుతం జరుగుతున్న మరమ్మత్తు పనులను సెప్టెంబరు మాసం లోపు  పూర్తి చెయ్యాలని అధికారులను ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. గత నెల 1 వ తేది నుంచి అలిపిరి నడక మార్గాన్ని అధికారులు మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు మాసం వరకు శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే భక్తులను టీటీడీ అనుమతిస్తుంది. మరికొన్ని ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: