కరోనా ఉధృతి ఎంతలా ఉందో చూస్తూనే ఉన్నాం. కోట్లకు కోట్లు ఉన్నవాళ్లే వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరికి వ్యాక్సిన్ మాత్రమే ప్రాణాధారంగా ఉంది. వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండడంతో అందరికి వ్యాక్సిన్ దొరికే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్పై ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన డిజప్పాయింట్ చేసింది. ఏపీలో అందరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మరో నాలుగు నెలల సమయం అయినా పడుతుందని చెప్పిన జగన్.. వచ్చే ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేశారు. కరోనాపై జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.