టీడీపీ నేత న‌రేంద్ర అరెస్టులో మ‌రో ట్విస్ట్ ఇచ్చిన ఏసీబీ

VUYYURU SUBHASH
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఈ రోజు ఉద‌యం ఆయ‌న నివాసంలో ఏసీబీ పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. సంగం డెయిరీ అక్ర‌మాల కేసులో ఆయ‌న్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు తెల్ల‌వారు ఝామునే ఆయ‌న్ను అరెస్టు చేసిన పోలీసులు మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుకానున్నారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా ఏసీబీ కోర్టుకు అధికారులు తీసుకురానున్నారు. narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం చట్టాన్ని ఉల్లంఘిచడమేనని పలువురు న్యాయవాదులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: