బ్రేకింగ్‌: హోం ఐసోలేష‌న్లో సీఎం... అంతా టెన్ష‌న్‌..టెన్ష‌న్‌

VUYYURU SUBHASH
క‌రోనా దేశ‌వ్యాప్తంగా ఉధృత రూపం దాల్చుతోంది. ప‌లువురు ప్ర‌ముఖులు హోం ఐసోలేష‌న్లోకి వెళ్లాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సైతం హోం ఐసోలేష‌న్లోకి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవోలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. సీఎంఓలు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో తాను కూడా హోం ఐసొలేషన్ లోకి వెళ్లాలని యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు. సీఎంవో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: