తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటున్నాయి. 40 - 45 డిగ్రీల వరకు ఎండలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం తెలంగాణలో స్వల్పంగా వర్షాలు కురిశాయి. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.