తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా తేలింది. షకీల్తో పాటు షకీల్ తండ్రి, తల్లి, సోదరిలకు కూడా కరోనా సోకడంతో వారంతా
చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం షకీల్ అహ్మద్ హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజులుగా కలసి వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని షకీల్ కోరారు. పూర్తి ఆరోగ్యంతోతిరిగి వస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షకీల్ చెప్పారు.