జ‌గ‌న్‌పై ప్ర‌ముఖ సినీన‌టుడు ప్ర‌శంస‌లు

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. రైతు సమస్యల పట్ల జగన్ చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. గ‌తంలో కూడా నారాయ‌ణ మూర్తి ప‌లుసార్లు సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు కితాబు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ఆయ‌న  జ‌గ‌న్‌పై త‌న‌కు ఉన్న అభిమానం చాటుకున్నారు.

తూర్పు గోదావ‌రి - విశాఖ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఏలేరు, తాండవ కాల్వల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని నారాయణమూర్తి అన్నారు. గత ప్రభుత్వాలు తూర్పుగోదావరి, ,విశాఖ జిల్లాలోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదని చెప్పారు. జగన్ ముందు చూపుకు నారాయణమూర్తి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: