దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తోన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా ఈ రోజు మోగనుంది. శనివారం మధ్యాహ్నం 4.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్మీట్ కూడా పెట్టనుంది. ఈ ఏప్రిల్ లేదా మే నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అసోంలో 126, కేరళలో 140, బెంగాల్లో 294, తమిళనాడులో 234, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో బిహార్లో అమలు చేసిన నిబంధనలే ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. ఇక వీటితో పాటు తెలంగాణలో నాగార్జునా సాగర్ అసెంబ్లీ స్థానంతో పాటు ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి సైతం ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా అదే రోజు రానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: