ఓటిటి లో విడుదలకు సిద్ధమవుతున్న మరో బాలీవుడ్ సినిమా..?
ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడంతో చాలామంది పెద్దపెద్ద సినిమాలను సైతం ఆన్లైన్ ఓటిటి కంపెనీల ద్వారా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోలు తమ తమ సినిమాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. బాలీవుడ్కు చెందిన మరో సినిమాని కూడా ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జాన్వి కపూర్ ప్రధాన పాత్ర గుంజన్ సక్సేనా అనే సినిమాను నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ ప్రదర్శించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జి స్టూడెంట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాని నెట్ ఫ్లెక్స్ లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా భారత సినిమా క్రిటిక్ అయిన తరన్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ ప్రకటన అంటూ తెలిపారు.
IT'S OFFICIAL... #GunjanSaxena: #TheKargilGirl to premiere on #Netflix... Stars #JanhviKapoor... Directed by sharan Sharma... Presented by Zee Studios and dharma Productions. #GunjanSaxenaOnNetflix pic.twitter.com/yqDLJOiuKp — taran adarsh (@taran_adarsh) June 9, 2020