'డర్టీ పిక్చర్'తో దూసుకెళ్లిన విద్యాబాలన్
విద్యా తర్వాత తన మొదటి హిందీ చిత్రం 'పరిణీత'తో ప్రశంసలు అందుకుంది. దాని తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన ఆమె హాస్య చిత్రం 'లగే రహో మున్నా భాయ్'. 2006 లో వచ్చిన ఈ చిత్రంలో విద్య ప్రధాన పాత్ర పోషించింది. అనంతరం రొమాంటిక్ కామెడీ మూవీస్ హే బేబీ (2007), కిస్మత్ కనెక్షన్ (2008)లో నటించింది. ఈ సినిమాలకు ప్రతికూల స్పందన వచ్చింది.
2009 డ్రామా పా, 2010 బ్లాక్ కామెడీ ఇష్కియా, 2011 సెమీ-బయోగ్రాఫికల్ థ్రిల్లర్ నో వన్ కిల్డ్ జెస్సికా, 2011లో సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్, 2012లో కహానిత్రీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విద్యా ఐదు విభిన్న పాత్రలు పోషించింది. వాటిలో ప్రతి ఒక్కటి అనేక అవార్డులను గెలుచుకుంది. ఆ తరువాత 'కహానీ 2: దుర్గా రాణి సింగ్' (2016), తుమ్హారీ సులు (2017), మిషన్ మంగళ్ (2019)లో వంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లో సభ్యురాలు మరియు రేడియో షోను నిర్వహిస్తోంది. విద్యా సినీ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ను వివాహం చేసుకుంది.