జగన్ సి‌ఎం పదవికి నిలువెత్తు నిదర్శనం ..!!

KISHORE
వైసీపీ పార్టీ అధినేత ఆంద్రప్రదేశ్ సి‌ఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21 పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు,వైసీపీ పార్టీ శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ పుట్టిన రోజుతో జగన్ 48 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. తక్కువ వయలులోనే ముఖ్యమంత్రిగా ఎదిగిన జగన్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుండి విప్లవాత్మక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటూ , చరిత్రాత్మక పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నాడు.

ఎక్కడ లేని వాలెంటీర్ వ్యవస్థ ను ప్రవేశపెట్టి ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి పథకం కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా నేరుగా ప్రజలకు అందేటట్లు గా చేస్తున్నారు..గ్రామాల్లోని ప్రజలు మీసేవల చుట్టూ,తిరగకుండా గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేశారు.అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలను వైఎస్ జగన్ నెరవేర్చడం మామూలు విషయం కాదని చెప్పాలి.కరోనా వచ్చి ఏడాది అవుతున్న రాష్ట్రంలో మాత్రం అభివృద్ది ఆపడం లేదు సి‌ఎం జగన్.

  పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు పలు సేవ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జననేత సుపరిపాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, కలకాలం ఈ పాలన కొనసాగాలని కాంక్షిస్తూ అభిమానులు పూజలు నిర్వహించనున్నారు.అలాగే రక్తదాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: