ముఖంపై మొటిమలు ఇంకా మచ్చల సమస్యకు ఖచ్చితంగా అనారోగ్య జీవనశైలి కూడా కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, మంచి ఆహారం తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు చర్మం చాలా డల్ గా కనిపిస్తుంది. అందుకే మెరిసే చర్మం కోసం కొన్ని సింపుల్ చిట్కాలను ఇక్కడ తెలుసుకొని పాటిద్దాం. ఇంట్లో ఉండే కొన్ని పదార్ధాలతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.ఇందు కోసం మీరు రాత్రి మిగిలిపోయిన రోటీని కూడా ఉపయోగించవచ్చు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిగిలిపోయిన చపాతీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖ చర్మానికి ఖచ్చితంగా మంచి మెరుపు వస్తుంది.ఇంకా ఈ మిగిలిపోయిన చపాతీని చర్మంపై అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలనేవి తెరవబడతాయి. అందువల్ల డీప్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. స్కిన్ టానింగ్ను తొలగించడానికి కూడా ఈ రోటీ ట్రీట్ మెంట్ చాలా బాగా పనిచేస్తుంది.
పచ్చి పాలను అప్లై చేయడం వల్ల మన ముఖం ఎల్లప్పుడూ తేమగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మెరుపునిస్తుంది.ఎందుకంటే పచ్చి పాలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన చర్మానికి చాలా మేలు చేస్తుంది.ఈ పచ్చి పాలను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది.అలాగే మీరు సహజంగా చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలనుకుంటే, తేనె దీనికి అత్యంత ప్రయోజనకరమైనది. మన ముఖంపై లోతైన శుభ్రత కోసం తేనెను ఉపయోగిస్తారు. తేనెను అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలు ఈజీగా శుభ్రపడతాయి.ముందుగా మీరు మిగిలిన రోటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలు ఇంకా తేనె వేసి కలపాలి. తరువాత మెత్తటి పెస్టుల తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీ ముఖంపై ఒక 10 నిమిషాలు అప్లై చేయండి. మీరు ఈ ఫేస్ ప్యాక్ను వారానికి 3 సార్లు అప్లై చేయవచ్చు. ఆ తర్వాత కనిపించే మార్పును కూడా మీరే గమనిస్తారు..