వంట్లలో పసుపును వేసుకోవడం వల్ల చక్కటి రంగు రావడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పసుపు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పసుపు మన శరీర ఆరోగ్యంతో పాటు ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పసుపును వాడడం వల్ల మనం మన చర్మసమస్యలన్నింటిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.అయితే చాలా మంది మొటిముల, మచ్చలు, చర్మం ముడతలు పడడం, చర్మంపై స్ట్రెచ్ మార్క్స్, జిడ్డు వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి చర్మ సమస్యలన్నింటిని తగ్గించడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. పసుపును వాడడం వల్ల చర్మ సమస్యలు ఈజీగా తగ్గడంతో పాటు చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ పసుపును ఎలా వాడడం వల్ల మనం చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా పసుపులో నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు ఇంకా పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.ఇంకా అలాగే పసుపులో ఆలివ్ నూనెను కలిపి గాయాలపై రాయడం వల్ల గాయాలు చాలా త్వరగా మానుతాయి. అలాగే ముడతల సమస్యతో బాధపడే వారు పసుపులో టమాట రసం, పాలు ఇంకా బియ్యంపిండి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చర్మంపై రాసి ఆరిన తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం చాలా బిగుతుగా తయారవుతుంది. చర్మంపై ఉండే జిడ్డు కూడా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడే వారు పసుపులో శనగపిండి, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ సమస్య ఈజీగా తగ్గుతుంది.