ముఖంపై మొటిమలు, ముడతలు తగ్గాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
ఇక ఎండాకాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లలో బీటా-కెరోటిన్, విటమిన్ ఎలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎంతో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మ్రుతకణాలను తొలగించడంతో పాటు మన చర్మాన్ని కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మన ఫేసుపై పింపుల్స్ ఇంకా అలాగే ముడతలు వంటివి కనిపించవు. దీంతో మన ముఖానికి మంచి నిగారింపు అనేది వస్తుంది.మనలో చాలా మందికి ఎండ వేడికి లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాల వల్ల ముఖంపై మొటిమలు ఇంకా అలాగే మచ్చలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఎండాకాలంలో వీటికి చెక్ చెప్పేందుకు మామిడిపండ్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ముందుగా ఒక పాత్రలో కొద్దిగా మామిడి పండ్ల గుజ్జు, రెండు టీ స్పూన్ల పెరుగు ఇంకా అలాగే రెండు టేబుల్ టీ స్పూన్ల తేనేను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక ఇరవై నిమిషాల వరకు వేచి ఉండాలి. ఇక ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ ముఖంపై వచ్చిన మొటిమలు ఇంకా అలాగే మచ్చలు ఈజీగా తొలగిపోతాయి.


అలాగే ఒక పాత్రలో ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు, ఒక టీ స్పూన్ తేనే, ఒక టీ స్పూన్ బియ్యపు పిండి ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక అరగంట పాటు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వల్ల చర్మంలోని మ్రుతకణాలన్నీ తొలగిపోయి చర్మం బాగా సాఫ్ట్ గా మారుతుంది.అలాగే ఒక కప్పులో మామిడి గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల అవొకాడో గుజ్జు ఇంకా ఒక టేబుల్ స్పూన్ తేనే వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల మామిడిలో ఉండే గుణాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: