మొటిమలు తగ్గి మెరిసిపోయే బ్యూటీ టిప్స్..

Purushottham Vinay
కలుషిత వాతావరణం ఇంకా అలాగే తీసుకునే ఆహారంలో పోషకలోపం కారణంగా అనేక చర్మ సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. ఇక ఈ సమస్యలను తగ్గించుకోవడానికి జోజోబా ఆయిల్ ను ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.చర్మకణాలలో పేరుకుపోయిన దుమ్ము ఇంకా అలాగే ధూళి కారణంగా మొటిమలు ఇంకా నల్లటి మచ్చలు ఏర్పడి మీ ముఖం చాలా అందవిహీనంగా తయారవుతుంది. అలాగే జుట్టు సమస్యలు కూడా మీకు ఏర్పడతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి జోజోబా ఆయిల్ అనేది ఓ మంచి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది.ఇక ఈ ఆయిల్ లో విటమిన్ బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే యాంటీ ఫంగల్ అలాగే యాంటీమైక్రోబయల్ వంటి ఖనిజాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ నూనె చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది. ఈ ఆయిల్ ను ఇతర ఆయిల్ తో పోలిస్తే ఈజీగా ఉంటుంది.మొటిమలు ఇంకా మచ్చలను ఈజీగా తగ్గాలంటే..ఒక కప్పులో బంకమట్టి ఇంకా అలాగే జోజోబా నూనెను వేసి బాగా కలుపుకోవాలి.ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా అప్లై చేసుకోవాలి.


ఒక పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి గనుక రెండుసార్లు చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖంపై మొటిమలు మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి.అలాగే చర్మానికి కూడా మంచి మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది. ఒక కప్పులో రెండు స్పూన్ ల జోజోబా ఆయిల్ ఇంకా రెండు స్పూన్ ల కలబంద జెల్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా సహాయపడి మీ చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.అలాగే చర్మకణాలలో  పేరుకుపోయిన మృత కణాలను ఈజీగా తొలగించడానికి జోజోబా ఆయిల్ మంచి దివ్య ఔషధంగా కూడా సహాయపడుతుంది. జోజోబా ఆయిల్ ను మీ ముఖానికి బాగా సున్నితంగా మర్దన చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కనుక ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుంటే మీ ముఖం చాలా ఫ్రెష్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: