పాదాల పగుళ్లు మిమ్మల్ని బాధిస్తున్నాయా ?
* పాదాల పగుళ్లు తగ్గే వరకు రోజు ఒక పది నిముషాలు మీ పాదాలను వేడి నీటిలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభించడమే కాకుండా, పగుళ్ల మధ్య ఏమైనా మట్టి కణాలు ఉంటే తొలగిపోతాయి.
* పాదాల పగుళ్లు ఎక్కువగా దురద పెడుతూ ఇబ్బంది పెడుతున్నాయా, అయితే ఒక చిన్న గిన్నె నుండి వేపాకు తీసుకుని మొదట మెత్తటి పేస్టులా చేసుకోవాలి. అందులో రెండు, మూడు టీ స్పూన్ల పసుపు వేసి బాగా కలపాలి. ఇక ఈ పేస్టును ఇప్పుడు పగుళ్లపై రాస్తే సరి. ఇలా కనీసం ఒక గంటపాటు ఉంచాలి. అనంతరం కొద్దిగా వేడి నీటితో పాదాలను శుభ్రపరుచుకొని మంచి శుభ్రమైన బట్టతో తుడుచుకోవాలి. ఈ రెండు చిట్కాలు పాదాల పగుళ్ల నుండి ఏర్పడిన నొప్పిని అలాగే పగుళ్లను దూరం చేయడానికి మీకు సహాయ పడతాయి. ఇదే విషయాన్ని మీ స్నేహితులకు మరియు బంధువులకు కూడా తెలియచేసి వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాము.