రేవంత్, బండిలు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారు : గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

నల్గొండలోని తన నివాసంలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధ‌ర్బంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ...బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ నోటికి అడ్డూ అదుపూ లేదని, బండి సంజయ్, రేవంత్ లు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వ్యాఖ్య‌నించారు. 
కాంగ్రెస్,బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందని సుఖేంద‌ర్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి సంబంధమే లేదని..సెప్టెంబర్17ను బీజేపీ ఆట వస్తువులాగా ఆడుకుంటుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారంటూ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ విమోచ‌న దినం సెప్టెంబ‌ర్ 17 అంటూ బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తూ వ‌స్తున్నారు...నిన్న నిర్మ‌ల్ లో ఏకంగా బీజేపీ భారీ స‌భ‌ను ఏర్పాటు చేసి అమిత్ షా కూడా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం ను అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: