కారు కొనాలని అనుకునే వారు ముందుగా బెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటారు. అయితే వాటికంటే ముందే మైలేజీ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. అయితే కొన్ని కార్లలో మైలేజీ ఇంకా ఫీచర్స్ వేర్వేరుగా ప్రత్యేకంతో ఉంటాయి.కానీ వినియోగదారులు మాత్రం ఖచ్చితంగా మంచి ఫీచర్స్ తో పాటు ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు ఏవున్నాయో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కంపెనీలు ఇప్పుడు ఎక్కువ మైలేజీ ఇచ్చే మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.వీటిలో మారుతి కంపెనీ నుంచి ఓ కారు లీటర్ కు ఏకంగా 40 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చేలా తయారు చేసింది. ఇంత మైలేజీ ఇచ్చే ఆ కారు ఏంటి ? దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో? ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇండియన్ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా దూసుకుపోతుంది మారుతి సుజుకి. వినియోగాదారుని అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసింది.
వీటిలో స్విప్ట్ ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకోవడంతో దానిని విపరీతంగా కొన్నారు. 2005లోనే స్విప్ట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మార్పులతో వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇప్పటి దాకా డిజైన్స్, ఫీచర్స్ అప్ గ్రేడ్ సాధించిన స్విప్ట్ ఇప్పుడు లేటేస్ట్ మోడల్ అందుబాటులోకి రాబోతుంది.స్విప్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి దాకా 4 తరాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఐదో తరంను కూడా మరింత ఆకర్షణీయంగా తయారు చేయడంతో పాటు బలమైన ఇంపాక్ట్ ను కలిగి ఉంది. ఈ కార్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ , బ్యాటరీతో పాటు 1.2 లీటర్ ఇంకా 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఏఆర్ బీఐ వెరిఫై చేసినట్లుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మోడల్ అత్యధికంగా కిలోమీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని ఖచ్చితంగా ఇస్తుంది. ఇది 89 బీహెచ్ పీ , 113 ఎన్ ఎం టార్క్ పవర్ ని జనరేట్ చేస్తుంది.