జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ(BMW) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక bmw అప్డేటెడ్ వెర్షన్ బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5) ఎస్యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.పైగా ఈ కారును బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్లో తయారుచేశారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ స్టార్టింగ్ వేరియంట్ ధర మొత్తం ₹ 93.9 లక్షలుగా, హైఎండ్ వేరియంట్ ధర ₹ 1.07 కోట్లుగా bmw కంపెనీ నిర్ణయించింది.బీఎండబ్ల్యూ ఎక్స్ 5లో పెట్రోల్/డీజిల్ వేరియంట్లలో 3-లీటర్ల ఇంజిన్లను ఫిక్స్ చేశారు. ఈ రెండు ఇంజిన్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ అనేది ఉంది. పెట్రోల్ ఇంజిన్ 381హెచ్పీ శక్తిని ఇంకా 521 ఎన్ఎమ్ టార్క్ను జనరేట్ చేస్తుంది. అలాగే డీజిల్ ఇంజిన్ 286 హెచ్పీ శక్తిని, 650 ఎన్ఎమ్ టార్క్ను రిలీజ్ చేస్తుంది.
ఇక పెట్రోల్ వేరియంట్ 5.4 సెకన్లలో, డీజిల్ వేరియంట్ 6.1 సెకన్లలో ఏకంగా 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటాయని కంపెనీ తెలిపింది. రెండు ఇంజిన్ వేరియంట్లలో 48 వోల్ట్ ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఉంది. ఇది 12హెచ్పీ శక్తిని జనరేట్ చేస్తుంది. ఈ కారు మరింత వేగంగా ప్రయాణించేందుకు ఎలక్ట్రిక్ మోటార్ సాయపడుతుందని బీఎండబ్ల్యూ కంపెనీ పేర్కొంది.అలాగే ఈ కారులో 14.9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తోపాటు 12.3 అంగుళాల ఇన్ట్రుమెంట్ క్లస్టర్ను కూడా ఇస్తున్నారు.ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బీఎండబ్ల్యూ ఐడ్రైవ్ 8 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ కార్ పనిచేస్తుంది. ఎక్స్లైన్ ట్రిమ్, ఎమ్ స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్లలో ఈ కారును మనం కొనుగోలు చేయొచ్చు. ఇక సరికొత్త ఫీచర్స్తో వస్తున్న బీఎండబ్ల్యూ ఎక్స్5 కంపెనీ మార్కెట్ పరిధిని మరింత విస్తరించేందుకు సహాయపడుతుందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు.