టాటా కార్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్?

Purushottham Vinay
టాటా కార్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్?

ఫేమస్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా అంటే మధ్యతరగతి వాహనప్రియులకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కార్ కొనాలనుకునే వారి కోరికను కేవలం టాటా కార్లు మాత్రమే చాలా తక్కువ ధరలో తీరుస్తాయి.అందువల్ల ఇండియాలో టాటా కంపెనీ కార్లు మిగతా కార్ల చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే టాటా కార్ లవర్స్‌కు టాటా కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో అమ్మే కొన్ని మోడల్స్ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే టాటా ఆల్ట్రోజ్, టాటా సఫారి, టాటా పంచ్, టాటా హారియర్, టాటా టియాగో ఇంకా అలాగే టాటా సఫారి కార్ల ధరలు పెంచడం జరిగింది. ఈ కార్ల ఎక్స్‌షోరూమ్ ధరలపై మాక్సిమం రూ.25000 పెంచుతున్నట్లు టాటా కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ రెండూ వెర్షన్లపై ధరల పెంపు ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 


ఓ పక్క ఈమధ్య నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టిన టాటా కంపెనీ తన పాత మోడల్స్ ధరను ఈ రకంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మార్కెట్ వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి.ఇక టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ కార్ రూ.10,000 పెరిగితే డీజిల్ వెర్షన్ రూ.15000 పెరిగింది.అలాగే టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు రూ.10,000 పెరిగింది. టాటా టిగోర్ వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.15,000 దాకా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అలాగే టాటా టియాగో పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు కూడా రూ.15,000 దాకా పెరిగడం జరిగింది. టియాగో ఎన్‌ఆర్‌జీ ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ వేరియంట్లు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా పెరిగాయి. టాటా హారియర్ ఇంకా అలాగే టాటా సఫారీ ఎక్స్ షోరూమ్ ధర రూ.25,000 దాకా పెరిగడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: