ప్రస్తుతం దేశంలో చాలా మంది కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.ఇక వారి ఆలోచనలకు తగ్గట్లే కంపెనీలు కూడా కొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో మారుతీ సుజుకీ కార్లు అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను తయారు చేస్తుందని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి మరో కొత్త కార్ను విడుదల చేసింది. టూర్ ఎస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్ కచ్చితంగా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెడాన్ విభాగంలో వచ్చిన టూర్ ఎస్ కార్ల ధరల విషయానికి వస్తే రూ.6.50 లక్షల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు ఎస్టీడీ (ఓ) ఇంకా ఎస్టీడీ (ఓ) సీఎన్జీ వెర్షన్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. ప్రెట్రోల్తో నడిచే ఎస్టీడీ (ఓ) ధర మొత్తం రూ.6.5 లక్షలు కాగా సీఎన్జీ వెర్షన్ ధర వచ్చేసి రూ.7.36 లక్షలుగా ఉండనుంది.
ఇక టూర్ ఎస్ కార్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్తో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఈ కార్లు 6000 ఆర్పీఎం వద్ద 89 బీహెచ్పీ ఇంకా 4400 ఆర్పీఎం వద్ద 133 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే సీఎన్జీ వెర్షన్లో అయితే 6000 ఆర్పీఎం వద్ద 76 బీహెచ్పీ ఇంకా అలాగే 4300 ఆర్పీఎం వద్ద 98.5 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. టూర్ ఎస్ కార్ ఇక లీటర్కు దాదాపు 23 కిలో మీటర్ల మైలేజ్ను ఇస్తుందని మారుతీ కంపెనీ ప్రకటించింది.ఇంకా అలాగే ఇందులోని సీఎన్జీ వెర్షన్ అయితే 32 కిలో మీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇంకా సెఫ్టీ టెక్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ కార్ మార్కెట్లోకి వస్తుంది. అలాగే ఈ కార్లో డ్యుయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా బ్రేక్ అసిస్ట్తో వచ్చే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటర్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి సదుపాయాలతో ఈ కార్ కస్టమర్లని ఎంతగానో ఆకట్టుకుంటుంది.