Auto Insurance: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌!

Purushottham Vinay
ఇక కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! త్వరలో వాహన బీమా  నిబంధనలు అనేవి మారుతున్నాయి. వినియోగదారుడికి అనుకూలమైన టాప్‌ అప్‌ ప్లాన్లు అనేవి ఇక వస్తున్నాయి.అలాగే వెహికిల్‌ను ఉపయోగించిన తీరు ఇంకా నడిపించిన విధానాన్ని బట్టి ఇకపై ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.ఇంకా అంతే కాదు. ఇంకా ఎన్ని వాహనాలు ఉన్నా ఒకే బీమా పథకం తీసుకొనే సౌకర్యం కూడా అమల్లోకి రానుంది.ఈ 'టెక్నాలజీ ఆధారిత వాహన బీమాను ప్రోత్సహించాలని ఐఆర్‌డీఏఐ (IRDAI) నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా ఇందులో భాగంగా టెక్నాలజీ ఆధారిత మోటార్‌ డ్యామేజీ బీమా పథకాలను కూడా ప్రవేశపెట్టేందుకు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. అందులో 1) వాహనం ఉపయోగించిన తీరు 2) వాహనం నడిపిన తీరు 3) బైకులు ఇంకా అలాగే కార్లకు కలిపి ఒకే రకమైన ఫ్లోటర్‌ పాలసీలు కూడా రానున్నాయి' అని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేషన్‌ ని జారీ చేసింది.ఇక కస్టమర్‌ ఏడాది మొదట్లోనే ఎంత వరకు బైక్‌ లేదా కారును ఉపయోగిస్తాడనేది ముందుగానే డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఉదాహరణకు ఒక ఏడాదిలో ఎన్ని కిలోమీటర్లు తిప్పుతారో అనేది చెప్పాలి! ఇంకా జియో ట్యాగింగ్‌ ఆధారిత యాప్‌ల ద్వారా యూసేజ్‌ను ట్రాక్‌ చేస్తారు.


అయితే ముందే పెట్టుకున్న లిమిట్‌ దాటితే క్లెయిమ్‌ ఎలా చేస్తారన్నది కంపెనీలు కూడా ఇంకా వివరణ అనేది ఇవ్వలేదు.కారు లేదా బైక్‌ యజమాని ప్రవర్తన ఆధారంగా కూడా ఈ యాడ్‌ ఆన్‌ స్కీమ్‌ అనేది ఉంటుంది. వేగం ఇంకా అలాగే వాడకం సహా ఇతర అంశాలను ఇన్సూరెన్స్‌ కంపెనీ లైవ్‌ ట్రాక్‌ చేయనుంది. ఇక వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఇన్సూరెన్స్‌ కంపెనీ మోటార్‌ కవరేజీ ఇస్తుంది. ఇంకా అలాగే ప్రీమియాన్ని కూడా నిర్ణయిస్తుంది.అలాగే ఆరోగ్య బీమాలో ఫ్లోటర్‌ పాలసీల గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఇప్పుడు దానిని వాహన విభాగంలో ప్రవేశపెడుతున్నారు. ఇంకా ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటే గతంలో వేర్వేరుగా బీమా అనేది తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కారు ఇంకా అలాగే బైక్‌ అనే తేడానే లేకుండా అన్నింటికీ కూడా కలిపి ఈ బీమా అనేది తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: