మహీంద్రా థార్ ఈవి : ఎలక్ట్రిక్ వెర్షన్ సూపర్ ఉందిగా!

Purushottham Vinay
ఇక ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ థార్ గురించి వాహన ప్రియులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.ఇక ఇందులో ఇటీవల వచ్చిన కొత్త తరం థార్ ఇటు సెలబ్రిటీలను అటు సామాన్య కస్టమర్లను ఇద్దరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం, ఇది పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ కార్ లో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లభిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే వచ్చంది ఓ డిజైనర్‌కి వెంటనే థార్ ఈవీ చిత్రాలను రెండర్ చేసి ఇంకా ఆన్‌లైన్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక భవిష్యత్తు మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే అన్న విషయం ప్రస్తుత ఈవీ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది ఊహించి, మహీంద్రా థార్ ఈవీ కొన్ని వాస్తవిక రెండరింగ్‌లు బింబుల్ డిజైన్స్ ని తయారు చేసింది.

శిలాజ ఇంధనాల లభ్యత తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో ఏదో ఒకరోజు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు ఖచ్చితంగా మారాల్సిందే. ఇక ప్రస్తుతానికి మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియో నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ భారతీయ ఆటో దిగ్గజం కొత్త EVలను విడుదల చేయడానికి ఎంతో దూరంగా మాత్రం లేదనే చెప్పాలి.నిజానికి, Reva ఇంకా అలాగే e2o వంటి ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసిన మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ ఆటోమోటివ్ బ్రాండ్‌లలో మహీంద్రా ఒకటి. మహీంద్రా కంపెనీ ఈవెరిటో పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. మహీంద్రా కంపెనీ రానున్న రోజుల్లో బహుళ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. ఇక ఈ మేరకు జులై 2022 నెలలో తమ కొత్త ఈవీ లైనప్ ను కూడా ఆవిష్కరించనుంది. అయితే, మహీంద్రా ఇంకా ఎలక్ట్రిక్ థార్‌ను ఊహించలేదని ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, దీనికి మంచి స్కోప్ అయితే బాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: