త్వరలో బొలెరో క్యాంపర్ మోడల్ విడుదల..!!

Purushottham Vinay
ఇక మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో విడుదల చేయనున్న బొలెరో క్యాంపర్ మోడల్‌ విడుదల కోసం కంపెనీ ఇటీవలే ఐఐటి మద్రాస్-బేస్డ్ కారవాన్ తయారీ సంస్థ అయిన కాంపర్‌వాన్ ఫ్యాక్టరీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ భాగస్వామ్యంతో కంపెనీ 'బొలెరో క్యాంపర్' రిలీజ్ చేస్తుంది.ఇక కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బొలెరో క్యాంపర్ మంచి ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అందుకోసం కంపెనీ సన్నద్ధమవుతోంది. ఈ క్యాంపర్ ట్రక్ మహీంద్రా బొలెరో క్యాంపర్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని మహీంద్రా కంపెనీ తెలిపింది.భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తరువాత ఈ రకమైన వాహనాలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఇక ఈ కారణంగానే కంపెనీ మహీంద్రా తొలిసారిగా క్యాంపర్ వాహనాలకు భారతీయ మార్కెట్ రెడీ అవుతుంది. ఇప్పటికి మార్కెట్లో చాలా కంపెనీలు క్యాంపర్ వాహనాలను అమ్ముతున్నాయి.


ఇక నివేదికల ప్రకారం బొలెరో గోల్డ్ క్యాంపర్‌లో చాలా లగ్జరీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ క్యాంపర్ ట్రక్ స్మార్ట్ వాటర్ సొల్యూషన్‌తో అందించబడుతుంది. దీనితో పాటు స్పెషల్ గా డిజైన్ చేయబడిన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్, రెస్ట్‌రూమ్, డైనింగ్, కిచెన్ ఇంకా అలాగే బయో-టాయిలెట్‌లు వంటి అనేక సౌకర్యాలను కలిగి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని ఇందులో ఉండటం వల్ల కుంటుంభాలతో కలిసి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వీకెండ్ లో కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లేందుకు ఇలాంటి వాహనాలు అనేవి ఖచ్చితంగా మంచి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి వాహనాలను నడపడానికి డ్రైవర్‌కు ఎలాంటి ప్రత్యేక లైసెన్స్ కూడా అవసరం లేదని మహీంద్రా తెలిపింది. టూర్ ఇంకా అలాగే ట్రావెల్ కంపెనీలు కూడా అలాంటి వాహనాలను అద్దెకు కొనుగోలు చేయగలవు. ఇక ఈ వాహనాలు వ్యక్తిగత అవసరాలను తీర్చడమే కాకుండా పర్యటనకు కూడా సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని  అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: