పెరిగిన కవాసకి బైక్ ధరలు

Purushottham Vinay
కవాసకి బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి స్పోర్ట్స్ బైక్స్ గా ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక మార్కెట్లో కూడా ఈ బైక్స్ కి మంచి డిమాండ్ వుంది.ఇక ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటికే దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతూ అధికారికంగా ప్రకటనలు చేయడం జరిగాయి. ఇక అంతే కాకుండా ఈ ధరలు అనేవి ప్రస్తుతం అమల్లోకి కూడా వచ్చేసాయి.అయితే ఇక ఇప్పుడు ప్రముఖ బైక్ కంపెనీ అయిన కవాసకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాల ధరలను పెంచినట్లు తెలిపడం జరిగింది.ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక కవాసకి ప్రకటించిన ఈ కొత్త ధరలు అనేవి ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి. కవాసకి నుంచి కొన్ని బైక్‌లు ఇకపై కూడా వాటి పాత ధరలకు అమ్మ బడతాయి. కానీ ఎక్కువ శాతం ఈ బైకుల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపడం జరిగింది.
ఇక దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పుడు వెలువడింది.ఇక కవాసకి కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ధరల జాబితాలో దాదాపు మొత్తం 9 బైక్‌లను చేర్చడం జరిగింది. ఇక ఈ కంపెనీ ధరల పెరుగుదలలో అతి తక్కువ పెరుగుదల రూ. 6,000/- కాగా, అత్యధిక పెరుగుదల 15,000/- రూపాయల వరకు ఉంటుంది.ఇక కవాసకి జెడ్ 650 మరియు వల్కాన్ ఎస్ ధరలు వచ్చేసి ఇప్పుడు 6,000 రూపాయలు పెరిగడం జరిగాయి.ఇక కవాసకి కొత్త ధరల జాబితాలో నింజా జెడ్‌ఎక్స్-10 ఆర్ ధర ఇక ఇప్పుడు ఏకంగా 15,000 రూపాయలు పెరిగిందట. ధరల పెరుగుదలకు ముందు కవాసకి జెడ్ 650 ధర బైక్ వచ్చేసి రూ. 6.18 లక్షలు కాగా, ఇప్పుడు దీని ధర ఈ సంవత్సరం ఆగస్టు 1 నుంచి రూ. 6.24 లక్షలు కానుంది, అంటే ఇది మార్కెట్లో రూ. 6.24 లక్షలకు అమ్మబడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: