కేవలం 499/- తో ఓలా ఇ-బైక్స్ బుకింగ్స్.. త్వరపడండి..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకోని ప్రముఖ క్యాబ్ కంపెనీ అయినా ఓలా ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ ని విడుదల చేయడానికి సన్నద్దమయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇటీవల ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే వాహనప్రియులకు ఓలా ఇప్పుడు మరొక శుభవార్తను తీసుకువచ్చింది.ఇక ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ని ఆఫీషియల్ గా ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చునట. ఇక దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఓలా కంపెనీ సిఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపడం జరిగింది. ఇక ఈ ఇ బైక్స్ బుకింగ్ సమయంలో హోమ్ డెలివరీ ఇంకా స్కూటర్ కలర్ వంటి వాటిని కూడా సులభంగా ఎంచుకోవచ్చునట.

ఇక ఈ ఓలా కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్, ఎస్ 1 ఇంకా ఎస్ 1 ప్రో పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇక లీకైన కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం చూసినట్లయితే ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'సిరీస్ ఎస్' అని పేరు పెట్టె అవకాశం కూడా ఉందట. ఇక అంతే కాకూండా ఈ స్కూటర్‌ను ఎస్ 1 ఇంకా ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో కూడా ఓలా కంపెనీ అందించే అవకాశం కూడా ఉంది.ఇక ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఇంకా అఫీషియల్ గా అయితే మాత్రం నిర్ణయించలేదు. కానీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఈ నెల చివరిలో కాని లేదా వచ్చే నెల ప్రారంభంలో కాని వెల్లడించే అవకాశం ఉందట.ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి ఒక పూర్తి ఛార్జీతో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదట.ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 90 కిమీ వరకు ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: