ఆకట్టుకుంటున్న ఇ-సైకిల్స్.. హోమ్ డెలివరీ కోసం బుక్ చేసుకోండి..

Purushottham Vinay
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకున్న ప్రాధాన్యత రోజురోజుకి చాలా ఎక్కువవుతోందనే చెప్పాలి. ఇక ఈ క్రమంలో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియా మార్కెట్లో పుట్టుకొస్తున్నాయి.ఇక ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ నహక్ మోటార్స్ తన రెండు ఇ-సైకిల్స్ గరుడ ఇంకా జిప్పీలల యొక్క హోమ్ డెలివరీలను ప్రకటించడం జరిగింది.నహక్ మోటార్స్ యొక్క ఈ రెండు ఇ -సైకిల్స్ వంద శాతం పూర్తిగా ఇండియా మార్కెట్లో తయారైనవి కావడం విశేషం. ఇండియా మార్కెట్లో గరుడ సైకిల్ ధర రూ. 31,999 ఉండగా, ఇక జిప్పీ సైకిల్ ధర రూ. 33,499 వరకు ఉంది. ఇక ఈ సైకిళ్ల కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఇక దీని ప్రకారం మొదటి దశ బుకింగ్స్ 2021 జూలై 2 వ తేదీ నుండి 2021 జూలై 11వ తేదీ వరకు ఓపెన్ లో ఉంటుంది.

ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు నహక్ మోటార్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు www.nahakmotors.eco అనే వెబ్‌సైట్‌ లోకి వెళ్లి తమకు నచ్చిన మోడల్‌ను సెలక్ట్ చేసుకుని చాలా సింపుల్ గా బుక్ చేసుకోనే అవకాశం వుంది.ఇక ఈ ఇ-సైకిల్స్ బుక్ చేసుకోవాలనే కస్టమర్లు ముందుగా 2,999 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇక నహక్ మోటార్స్ జూలై 13వ తేదీ లోగా వినియోగదారులందరికీ కూడా ఈ ఇ-సైకిల్స్ పంపిణీని షెడ్యూల్ చేస్తుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ ఇ-సైకిల్స్ కావాలనుకునేవారు వెంటనే బుక్ చేసుకోండి.ఇక ఈ ఇ-సైకిల్స్ బుకింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత కంపెనీ 2021 ఆగస్టు 15 వ తేదీ నుండి సైకిల్స్ హోమ్ డెలివరీ చేయనుంది. ఇక ఈ రెండు ఇ - సైకిళ్ళు చాలా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇక ఇందులో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ, ఎల్‌సిడి డిస్‌ప్లే అలాగే పెడల్ సెన్సార్ టెక్నాలజీ వంటి వాటిని ఉపయోగించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: