బుకింగ్స్ లో మహీంద్రా ఎక్స్ యూవి300 న్యూ రికార్డ్....
దీంతో మహీంద్రా ఎక్స్యూవీ300 ధర కూడా పెరిగింది.వేరియంట్ను బట్టి రూ.1,000 నుండి రూ.39,000 వరకూ ధరలను పెంచింది. పెరిగిన ధరలను ఎక్స్-షోరూమ్ నుండి ఆన్-రోడ్కు పోల్చి చూస్తే అవి సుమారు రూ.90,000 వరకు ప్రభావితం చేస్తాయి. ధరల పెరుగుదల తర్వాత ఈ ఎస్యూవీ ఇప్పుడు రూ.7.96 లక్షల నుండి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో లభిస్తుంది.ఇందులో ఏబిఎస్ విత్ ఇబిడి, 2 ఎయిర్బ్యాగులు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మొదలైనవి ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ300 కాంపాక్ట్ ఎస్యూవీ కోసం పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ మోడల్ కోసం ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా సుమారు 12 వారాలకు పైగా ఉంటోంది. మహీంద్రా ఎక్స్యూవీ300 మోడల్ని కంపెనీ భారత మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్-ఎస్యూవీ విభాగంలో ప్రవేశపెట్టింది.
మహీంద్రా ఎక్స్యూవీ300 పెట్రోల్ వెర్షన్లో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది ఎక్కువగా 109 బిహెచ్పి శక్తిని ఇంకా 200 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఎక్స్యూవీ300లో 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 117 బిహెచ్పి శక్తిని ఇంకా 300 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్తో లభిస్తాయి.మహీంద్రా ఎక్స్యూవీ300 ఎస్యూవీలో కంపెనీ సైలెంట్గా కొన్ని ఫీచర్లను తొలగించింది. ఇందులో ఇప్పుడు రెండవ వరుసలోని మధ్యలో కూర్చునే ప్యాసింజర్ కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్ను తొలగించి, కేవలం ల్యాప్బెల్ట్ మాత్రమే ఆఫర్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ ఈ కారులో ఆఫర్ చేసిన హీటెడ్ సైడ్ మిర్రర్స్ ఫీచర్ను కూడా కంపెనీ తొలగించింది.