బిగ్ బాస్ 2 విన్నర్ కు ఆర్ధిక కష్టాలు... షాక్ లో ఫ్యాన్స్ ?

VAMSI
కౌశల్ మందా తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 2 విజేతగా ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. కౌశల్ మోడల్ గా, నటుడిగా ఎన్నో పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ షోకి వచ్చాక వచ్చింది. ఒక్క గుర్తింపు మాత్రమే కాదు ఓ రేంజ్ లో క్రేజ్ కూడా పెరిగింది. ఏకంగా కౌశల్ ఆర్మీ అంటూ పెద్ద సైన్యమే ఏర్పడింది. అయితే ఈ బాసు ఎంత స్పీడ్ గా పాపులారిటీ ని పొందారో అంతే స్పీడ్ గా హౌజ్ నుండి బయటకు వచ్చాక విమర్శల పాలయ్యారు. పిఎం ఆఫీస్ నుండి ఫోన్ కాల్‌.. గిన్నీస్ బుక్ రికార్డ్‌.. డాక్టరేట్‌ అంటూ గొప్పలకు పోయి ప్రకటనలు చేసి నవ్వుల పాలు అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో నెటిజన్లు ఈ సార్ నీ ఓ రేంజ్ లో కామెంట్లతో ఆడేసుకున్నారు.
అయితే 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను మరియు ల్యాండ్ ను అందుకున్న కౌశల్ ఇపుడు ఆర్ధిక కష్టాలు పడుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అందుకే అవకాశం వచ్చిన చోటల్లా ఈయన , ఈయన సతీమణి దర్శనమిస్తున్నారు అంటూ చెబుతున్నారు.  ఇటీవల యాంకర్ ఓంకార్  గేమ్‌ షో ఇస్మార్ట్‌ జోడీ లో కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు కౌశల్ మరియు ఆయన సతీమణి. అయితే టైటిల్ కొట్టాల్సింది కానీ లాస్ట్ మినిట్ లో ఛాన్స్ మిస్ అయ్యింది. మళ్లీ ఆ తర్వాత పలు ఎంటర్‌ టైన్మెంట్‌ ఛానల్స్ లో కూడా పాల్గొన్నారు. అలా పిలవాలే కానీ ప్రతి చోట వాలిపోతూ సందడి చేస్తోంది ఈ జంట.
తాజాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పార్టిసిపేట్ చేశారు ఈ కపుల్. కాగా సతీమణి తో కలిసి కౌశల్ స్టెప్పులు వేయగా ఆ కోలాహలం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరికి ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యాయి అని అందుకే ఇలా ఎక్కువగా షో లలో కనిపిస్తున్నారు అని బుల్లితెర వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన ఫాన్స్ మాత్రం షాక్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: