వేలాది మంది పిల్లలకు కనపడే దైవం ఈ శ్రీజారెడ్డి... అనేక సమస్యలకు ఒకే చోట పరిష్కారం..!
కడుపులో కొండంత బాధ.. గుండెల్లో తీరని ఆవేదన.. కన్నుమూసినా..తెరిచినా.. అచేతన దృక్కులతో కనిపించే తమ కడుపు పంటలు! ఆటింజంతో అల్లాడే.. కంటివెలుగులు. చేతిలో డబ్బులున్నా.. వైద్యం చేయించాలనే తాపత్రయం ఉన్నా.. ఎవరు ఎక్కడ వైద్యం అందిస్తారో తెలియని పరిస్థితి. అందించినా.. ఇదొక్కటే చాలదు.. ఆ థెరపీ కూడా చేయించండి.. దాంతోపాటు మరో థెరపీ అందిస్తేనే స్పీచ్ వస్తుంది.. అది మరో చోట ఉంటుంది! ఇదీ.. ఆటిజం చిన్నారుల తల్లిదండ్రులు పడిన అవస్థలు. తమ చిన్నారులు ఆటిజంతో అల్లాడుతుంటే.. వారికి వైద్యం అందించేందుకు ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదన మరింత వర్ణనాతీతం.
వీరికి సాంత్వన కలగలాలంటే.. ఏకైక మార్గం ఒక్కటే ఉంది. అదే.. ఆటిజం వైద్యానికి సంబంధించిన అన్ని సదుపాయాలు, అన్ని థెరపీలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. డబ్బులు ఖర్చయినా.. అవన్నీ ఒకే చోట లభించే సదుపాయం ఏర్పడడం. మరి ఇలాంటి సేవలను ఎవరు అందిస్తారు? ప్రభుత్వాలు చేస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఆటిజం సమస్యను తన ఇంట్లోనే భరిస్తున్న ప్రముఖ టెకీ కుటుంబం కోటిరెడ్డి సరిపల్లి,
చిల్డ్రన్ స్పెషలిస్టులను కలిశారు. మానసిక చికిత్సా నిపుణులను సంప్రదించారు. అయితే, వీరంతా ఒకే చోట లేకపోవడంతో తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటిజంతో ఇబ్బంది పడే వేలాది మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా.. ఆయా సేవలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని
పినాకిల్ బ్లూమ్స్లో మెషిన్ లెర్నింగ్, బిగ్డేటా టెక్నాలజీ, ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, లాంగ్రేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ ఇలా అనేక రూపాల్లో ఆటిజం చిన్నారులకు ఈ సంస్థ కల్పవృక్షంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆటిజం బాధితులు నేడు