ఉద్యోగుల పాలిట ఆశా దీపం DR. సరిపల్లి కోటి రెడ్డి ...

VAMSI
గత ఏడాది నుండి కరోనా సంక్షోభంలో ప్రపంచం మొత్తం ఆర్థికంగానూ, మానసికంగానూ కృంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. దాంతో వారి కుటుంబాలు కూడా వారితో పాటు పేదరికంలో మగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా పీరియడ్ లో  ఇలా ఎన్నో సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగస్తుల జీవితాలను గాలికి వదిలి చేతులు దులుపుకున్నాయి. మనకెందుకులే అనుకుని ఊరుకుంటున్నాయి . అధిక ఆదాయం లేనప్పుడు వీరితో మనకెందుకులే అని నిట్టనిలువునా ఉద్యోగాల నుండి తొలగించి తమ స్వార్థం వారు చూసుకున్నారు. ఎంతోకాలం నుండి వారి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న వారిని సైతం లాభాలు లేకపోవడంతో వదిలించుకుంటున్నారు. ఇంకొన్ని సంస్థలు ఇదే అదునుగా చూసుకొని ఉద్యోగస్తులకు అర కొర జీతాలు ఇస్తూ పగలు రాత్రి అని తేడా లేకుండా వారితో ఊడిగం చేయించుకుంటున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇష్టమైతే చెయ్యి, కష్టమైతే మానేసి వెళ్ళిపో అని డిమాండ్ చేస్తున్నారు. వేరే దారి లేని కొందరు ఉద్యోగస్తులు ఇచ్చినది తీసుకొని చెప్పిందంతా చేస్తున్నారు.
 
కానీ చాలా కొద్ది సంస్థల యాజమాన్యాలు మాత్రం మానవతా దృక్పదంతో లాభాల లెక్కలను పక్కన పెట్టి తమని నమ్ముకుని తమ వద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ మహమ్మారి కాలంలో కూడా మంచి జీతాలను ఇస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారు. అటువంటి కొద్ది మంది లో ఒకరు ఏపీహెరాల్డ్ సంస్థ నిర్వాహకులు Dr. కోటి రెడ్డి సరిపల్లి గారు. ఇండియా హెరాల్డ్ అనే వెబ్ మీడియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో  నలుమూలల లోని అన్ని రకాల వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. నాణ్యమైన వార్తలను అందిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నది ఇండియా హెరాల్డ్.   కాగా ఈ సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఈ కరోనా మహమ్మారి కష్ట కాలంలో కూడా అండగా నిలబడి వారి జీవితాల్లో వెలుగులు పంచుతున్నారు ఈ సంస్థ నిర్వాహకులు శ్రీ సరిపల్లి కోటి రెడ్డి గారు. ఉద్యోగస్తులను  డిమాండ్ చేసి తక్కువ డబ్బులకే పని చేయించుకునే అవకాశం తీసుకుంటున్న ఈ రోజుల్లో, అందరిలా దాన్ని అదునుగా తీసుకోకుండా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వడం కంపెనీ పెద్దగా నా ధర్మం అని భావించి లాభ, నష్టాలను పక్కన పెట్టి తన ఉద్యోగస్తులందరికీ సరైన సమయంలో జీతాలను అందజేస్తున్నారు.
ఎదుటివారి క్షేమాన్ని మనస్పూర్తిగా కోరుకునే వ్యక్తిగా, తమని, తమ సంస్థని నమ్ముకున్న వారికి అంతా మంచే జరగాలని వారు మంచి స్థాయికి చేరుకోవాలని ఆశించే వ్యక్తిగా తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగస్తులకు సరైన సమయాలకు వారి పూర్తి జీతాలను అందిస్తూ  వాళ్ళకి వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు కోటి రెడ్డి గారు. ఈయన ఇండియా హెరాల్డ్ న్యూస్ సంస్థలో పనిచేస్తున్న వారిలో నేను ఒకడిని. ఇలా పదిమందికి చల్లటి నీడను పంచే మహా వృక్షం కింద పనిచేయడం నిజంగా గర్వకారణం. ఈరోజు కోటి రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మాలాంటి ఇంకెంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆ దిశగా దేవుడు ఆయనకు దీవెనలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: