ఆ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన కండోమ్స్.. ఎందుకో తెలుసా?

Satvika
కండోమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందరికి తెలిసే ఉంటుంది.. ఈరోజుల్లో యువతకు ఏది చెప్పాల్సిన పనిలేదు..ఇది కలికాలం.. అయితే కరోనా తర్వాత నుంచి వీటికి డిమాండ్ భారీగా పెరిగింది..అందుకు వాడటం కన్నా వేరే విధంగా వాటిని వాడుతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..అవేంటో ఇప్పుడు చుద్దాము.. లైంగిక వ్యాధులు సంక్రమించకుండా వాడే ఒక సేఫ్టీ..భార్యాభర్తలు మాత్రం అప్పుడే పిల్లలు వద్దనుకుంటే దీన్ని వాడుతున్నారు.ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ మధ్య డేటింగ్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు వాడుతున్నారు..

అలా వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగిపొయింది. కానీ కొందరు కుర్రాల్లు మాత్రం వాటిని శృంగారం కోసం వాడటం లేదు. మరి వాటితో ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? వాటితో యువకులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు. ఎందుకంటే.. కొందరు యువకులు కండోమ్‌లను నీటిలో నానబెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. తర్వాత ఆ నీళ్లను తాగేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. యువకులు ఈ పని ఎందుకు చేస్తున్నారనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...

వివరాల్లొకి వెళితే..పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన సామాన్య యువకులు, విద్యార్థులు స్థానిక మెడికల్ షాప్‌లలో విపరీతంగా కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. తర్వాత కండోమ్‌లను పాడేసి.. ఆ నీళ్లను తాగి, మత్తులో తూగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు నిపుణులు స్పందిస్తూ.. కండోమ్‌లను సుమారు 5-6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీళ్లకు ఆల్కహాలిక్ స్వాభావం వస్తుందని అంటున్నారు. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే కాలేజీ స్టూడెంట్స్ ఆ మత్తుకు ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు.ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ పెద్ద మొత్తంలో కండోమ్‌ లను కొంటున్నారు.. ఈ విషయం పై అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత యువత ఇదే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి..ఏంటో ఈ జనాలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: