పెళ్ళై మూడేళ్లయిన ఫస్ట్ నైట్ కాకపోవడంతో ఆరా తీసిన భార్య..చివరికి..

Satvika
పెళ్ళి జరుగుతుంది అనుకుంటే చాలా మందికి ఎన్నో ఆశలు ఉంటాయి..నాజీవితం మూడు ముళ్ళ బంధం తో మరొకరికి సొంతం అయ్యింది.ఇక అదే నా ప్రపంచం..అని అమ్మాయిలు, అబ్బాయిలు అనుకుంటారు.అయితే అన్ని వేళ్ళు సమానంగా ఉండవు అనే మాట ఎంత నిజమో..ఈ భార్యాభర్తల బంధం కూడా అంతే.. కొన్ని బంధాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అయితే మరి కొన్ని బంధాలు మాత్రం అంతుచిక్కని రహస్యాలుగా ఉంటాయి.. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన మాత్రం జనాలకు పిచ్చి ఎక్కిస్తుంది.. 3 ఏళ్ళు అయిన కూడా భర్త దగ్గరకు రాక పోవడంతో అనుమానం తో భార్య వింత పని చేసింది..

వివరాల్లొకి వెళితే.. తల్లిదండ్రులు కట్నకానుకలు ఘనంగా ఇచ్చి మరీ పెళ్లి చేశారు. కాని ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు ప్రతీసారి ఎదురుదెబ్బ తగిలింది.భర్తకు దగ్గరవ్వాలని చూడగా.. అతడు ప్రతీసారి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. మూడేళ్లలో ఇద్దరూ ఒక్కసారి కూడా శారీరికంగా దగ్గరవ్వలేదు. దీంతో భర్తపై అనుమానమొచ్చి.. అత్తను ఆరా తీయగా షాకింగ్ నిజం ఒకటి బయటపడింది...

ఇండోర్‌కు చెందిన ఓ మహిళకు 2019లో ప్రీతేష్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆమె తల్లిదండ్రులు సుమారు రూ. 25 లక్షలు కట్నం ఇచ్చి మరీ ఘనంగా పెళ్లి చేశారు. ఇక ఎన్నో ఆశలతో ఆమె అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. అయితే సదరు మహిళకు ప్రతీ విషయంలోనూ షాక్ తగులుతూ వచ్చింది. మొదటి రాత్రి నుంచే తన భర్త ప్రీతేష్ వ్యవహారం అనుమానస్పద రీతిలో కనిపించింది. అస్సలు దగ్గరకు రానిచ్చేవాడు కాదు.. చొరవ తీసుకుని దగ్గరకు వెళ్తే ఆమెను తిట్టి పంపించేవాడు. ఇలా మూడేళ్లలో ఇద్దరూ ఒక్కసారిగా కూడా శారీరికంగా కలవలేదు. దీంతో భర్త ప్రవర్తనపై అత్తను ఆరా తీసింది సదరు మహిళ. తన కొడుకు శారీరిక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. తొందర్లోనే అంతా సర్దుకుంటుందని ఆమె అత్త చెప్పుకొచ్చింది..


తన లోపాన్ని భార్య ఎక్కడ బయటికి చెబుతుందోనని ప్రీతేష్ ఆమెను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. రూ. 20 లక్షలు కట్నం తీసుకురావాలని.. తీసుకొస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలని చెప్పి.. ఆ మహిళను బయటికి గెంటేశాడు. దీంతో బాధిత మహిళ పుట్టింటికి వెళ్లి.. తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. కూతురి అత్తగారింటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తీ వివరాలను సెకరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: