గుడిలో హుండీ దోచేసి లెటర్ రాసిన దొంగ!

Purushottham Vinay
దొంగలందరూ కూడా చెడ్డోళ్ళు కారు. ఆ దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారా? చోరీలు చేసిన దొంగలు పశ్చాత్తాపపడతారా? ఇంకా అలాగే దొంగ సొమ్ముతో ఏం సుఖపడతాం?అని ఎప్పుడన్నా కూడా తమని తాము ప్రశ్నించుకుంటారా? అంటే మేం కూడా అందరిలా సాధారణ మనుషులమే..మాకు కూడా పుణ్యం ఇంకా పాపం తెలుస్తుంది అంటున్నాడో దొంగ. గుడి హుండీని దోచేసి ఆపై అతను పశ్చాత్తాప పడ్డాడు. ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి ఇచ్చేసి..అలా తాను ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నానో కూడా తెలుపుతో ఓ లెటర్ కూడా రాసి హుండీలో వేశారు. ఆ లెటర్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ (శివాలయం)ఆలయంలో జూన్ 17 వ తేదీన అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఓ దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా కూడా దోచుకుపోయాడు. ఇక ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో నగదు లెక్కించే కార్యక్రమం కూడా చేపట్టారు ఆలయ నిర్వాహకులు. జూన్‌ 22 వ తేదీ మంగళవారం రోజున ఆ హుండీ తెరిచారు. ఇక అందులో ఓ లేఖ ఉంది.


ఇక దాన్ని ఎవరైనా భక్తులు వేశారేమో అనుకున్నారు మొదట. కానీ ఆ లెటర్ చదివాక తెలిసింది ఆ అసలు విషయం. ఆ లెటర్ ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు అక్కడి అధికారులు.ఇక ఆ లేఖలో ఏముందంటే."నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి ఆ నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత అనేది అసలు లేకుండాపోయింది. నా కుటుంబంలో కూడా గతంలో ఎన్నడూ లేని సమస్యలన్ని కూడా వచ్చిపడ్డాయి. ఇక నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఆ దేవుడు కూడా క్షమిస్తాడు అని ఆశిస్తున్నాను. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు కూడా జతచేసి ఉంది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతూ హల్‌చల్‌ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: