రేపటి నుంచి..మొబైల్స్ లో గూగుల్,యూట్యూబ్ సేవలు బంద్..?

Divya
సెప్టెంబర్ 27 నుంచి అంటే రేపటి నుంచి.. కొన్ని మొబైల్స్ లో గూగుల్ , జీ మెయిల్, యూట్యూబ్ వంటివి నిలిచిపోనున్నాయట.మీ మొబైల్ ని అప్గ్రేడ్ చేయకపోతే రేపటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.
రేపటి నుంచి కొన్ని లక్షలాదిమంది ఫోన్లలో ఈ సేవలను నిలిపివేయనున్నట్లుగా తెలుస్తోంది. పాత స్మార్ట్ మొబైల్స్  లో గూగుల్ సంబంధించిన అకౌంట్లు పూర్తిగా పని చేయవట. ఇవన్నీ పని చేయాలంటే మొబైల్ ను అప్గ్రేడ్ చేయాలి, లేదా మరో కొత్త మొబైల్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే జీ మెయిల్,గూగుల్,యూట్యూబ్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇక రేపటి నుంచి..2.3 వెర్షన్  మొబైల్స్ లో గూగుల్ యాప్స్ లాగిన్ అవ్వలేరు.
ఆండ్రాయిడ్ 2.3 అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న మొబైల్స్ మీ సేవలను పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. ఈ మొబైల్స్ వాడేటువంటి యూజర్ల భద్రత డేటా సురక్షితం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గా గూగుల్ సంస్థ తెలిపింది. అందుచేతనే ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ వినియోగించే వారంతా తక్షణమే వారి యొక్క మొబైల్ సాఫ్ట్ వేర్ ను అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటోంది గూగుల్ సంస్థ.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11 వర్షన్  లో ఉన్న యాపిల్, ఐఫోన్ లలో కొనసాగుతుంది. 2017 లో ఆండ్రాయిడ్ 2.3 ఫోన్లలో కూడా ఈ సేవలను నిలిచి వేయనుంది. ఇప్పటివరకు అలాంటి వేరియంట్స్ ఎంతో ఉన్న మొబైల్లో ఫోన్ లిస్ట్  ఇలా ఉంది. ఇందులో మీ మొబైల్ ఉన్నదేమో ఒకసారి చూసుకోండి.
Lenovo k800,vodafone smart,sony xperia advance,samsung galaxy S2,sony xperia S, lg SPECTRUM,HTC VELOCITY,MOTOROLA fire ,HTC EVO 4G,MOTOROLA XT532. ఇక ఇవే కాకుండా ఇక పాత వర్షన్ తో కలిగిన మొబైల్ లో కూడా ఈ సేవలను నిలిపి వేయనున్నట్లుగా గూగుల్ సంస్థ తెలుపుతోంది. ఒకవేళ మీ మొబైల్ కనుక ఉంటే అప్గ్రేడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: