భ‌ర్త తో విడిపోయి ఈ మ‌హిళ చేసిన ప‌నికి షాక్ అవ్వ‌ల్సిందే!

Dabbeda Mohan Babu
భ‌ర్త తో ఎవ‌రైనా విడిపోతే బాధ‌గా ఉంటారు. ఎల్ల కాలం తోడు ఉండేవాడు విడిపోయాడు అని కుమిలిపోతారు. తాను భ‌విష్య‌త్తులో ఒంట‌రిగా ఎలా బ‌త‌కాలి అని రోధిస్తారు. కానీ ఒక మ‌హిళ మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తుంది. భ‌ర్త‌తో విడిపోయినందుకు సంతోషం వ్య‌క్తం చేస్తుంది. విడిపోవ‌డాన్ని ఒక పండగ లా సెల‌బ్రేట్ చేస్తుంది. త‌న‌కు చాలా రోజుల త‌ర్వాత స్వ‌తంత్రం వ‌చ్చింద‌ని సంబుర ప‌డి పోతుంది. ఈ విష‌యాన్ని త‌న బంధువుల‌కు, మిత్రుల‌కు సంతోషం గా చెబుతూ ఆనందంగా ఉంటుంది. అంతే కాకుండా డివోర్స్ పార్టీ ని కూడా పెట్టింది. ఈ పార్టీకి త‌న బంధు మిత్రుల‌ను ఆహ్వానించింది. అంతే కాదు రంగు రంగు ల బ‌ట్ట‌లు ధ‌రించి త‌న స్నేహితుల‌తో డాన్స్ లు కూడా చేసింది.

మనం ఆహ్వానం సినిమా చూసే ఉంటం క‌దా. ఆహ్వానం సినిమాలో హిరోయిన్‌ ర‌మ్య కృష్ణ హిరో శ్రీకాంత్ వ‌ద్ద నుంచి విడాకులు తీసుకుంటుంది. విడాకులను కూడా పెళ్లి  జ‌రిగి న‌ట్టు తీసుకుంటుంది. కానీ ఆ సినిమాలో శ్రీకాంత్ నుంచి విడాకులు తీసు కుంటున్నందుకు రమ్య కృష్ణ భాద ప‌డుతుంది. కానీ ఇక్క‌డ అచ్చం ఆహ్వానం సినిమా లో జ‌రిగినట్టే జ‌రిగింది. కానీ ఈ మ‌హిళ ఎలాంటి బాధ ప‌డ‌లేదు. పైగా త‌న‌కు స్వేచ్ఛ వ‌చ్చింద‌ని సంబు ప‌డింది.

ఆ మ‌హిళ పేరు సోనియా గుప్తా. ఈమెకు ప్ర‌స్తుతం 45 సంవ‌త్స‌రాలు. ఈమెకు 2003 లో పెద్ద‌లు పెళ్లి చేశారు. దాదాపు 17 ఏళ్ల పాటు త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉంది. వీరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో ఇప్పుడు డైవ‌ర్స్ తీసుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ 17 ఏళ్ల త‌ర్వాత త‌న‌కు స్వేచ్ఛ వ‌చ్చింద‌ని సంబుర‌ప‌డింది. త‌న మిత్రుల‌కు డివోర్స్ పార్టీ కూడా ఇచ్చింది. ఈమె చేసిన ఈ ప‌నికి అంద‌రూ షాక్ అవుతున్నారు. భ‌ర్త నుంచి విడిపోయిన వారు బాధ ప‌డుతారు కానీ ఇలా పార్టీలు చేసుకుంటారా అని ముక్క‌న వేలు వేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: