వైరల్ : భూమ్మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ ఇదే..!
ఇకపోతే ప్రస్తుతం భూమి మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ ను ఇటీవల కనుగొనడం జరిగింది. నిజానికి ఆపిల్ గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతను కూడా హ్యాకర్లు హ్యక్ చేస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ భూమ్మీద అత్యంత సురక్షితమైన మొబైల్ లేనే లేదా..? అని ఆలోచిస్తున్న సమయంలోనే జర్మనీ కి చెందిన ఒక నైట్రోకీ కంపెనీ తయారు చేసినటువంటి నైట్రో ఫోన్ వన్ భూమి మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు చెందింది. దీనిని ఇటీవల 9టూ5 గూగుల్ నివేదించింది అని సమాచారం.
వినియోగదారుల రహస్యాలను గోప్యంగా ఉంచడం కోసమే ఈ నైట్రో ఫోన్లు తయారు చేశారట. ఇక ముఖ్యంగా ఈ ఫోన్ తయారు చేసేటప్పుడు గూగుల్ పిక్సెల్ 4a లో ఉన్న హార్డ్వేర్ పార్ట్ ను తీసివేసి , ఇతర హార్డ్ వేర్ తో రీప్లేస్ చేశారని సమాచారం. అంతే కాదు ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి బదులుగా గ్రాఫ్రేనియన్ ఓ ఎస్ ఆపరేటింగ్ సిస్టం ను పొందుపరిచారు. ఇక దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ,గూగుల్ కు సంబంధించిన ఎటువంటి యాప్ లను కూడా మనం ఈ నైట్రో ఫోన్లో చూడలేము. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్ కు యాక్సిస్ ఉండదు. ఇకపోతే భారత మార్కెట్ ప్రకారం దీని ధర 54629 రూపాయలు గా పరిగణించారు.