తాలిబన్ నుంచి తప్పించుకున్నారు.. భారత్ కాపాడింది..!
మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో.. ఒకరు 8 సంవత్సరాల మలాలా కాగా మరొకరు తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన పాస్తానా.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పశ్చిమబెంగాల్లో హౌరా లో ఒక కొత్త ఇంటిని తీసుకొని, అక్కడ నివసిస్తున్నారు. పొరుగు రాష్ట్రం వారు మద్దతు ఇవ్వడంతో అందరూ మెచ్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కోల్ కత్తాకు సుమారుగా రెండు వారాలు ప్రయాణం తర్వాత ,ఈ కుటుంబం పశ్చిమబెంగాల్లో ఆశ్రయం పొందుతోంది. వీరు తమ కొత్త జీవితాలను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే కాబూల్ లో ఉన్న తన ఇల్లు ,షాపు, ఆదాయవనరులు అన్నీ కూడా తాలిబన్ యోధులు లాగేసుకోవడంతో నిరాశ్రయులైన మొహమ్మద్ ఖాన్ కొత్తగా తన జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడట.. మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. రెండు మూడు వారాల కిందట నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పిల్లలు కూడా తిండి పెట్టలేక అల్లాడిపోయారు ..కానీ ఎట్టకేలకు భారతదేశానికి చేరుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ మంచి స్నేహితులు ఉన్నారు.. అందరూ నాకు చాలా బాగా సహాయం చేస్తున్నారు.. భారతీయులు కూడా మా ఇంటికి వచ్చారు. వీరు చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.. అని తెలిపాడు.