వైరల్ : సెల్ఫీ పిచ్చి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వుకుంటారు?

praveen
ఇటీవల కాలం లో ప్రతి ఒక్కరి జీవితం లో మొబైల్ అనేది ఎంత కీలక పాత్ర వహిస్తుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల మనిషిని ఆరంగుళాల మొబైల్ కంట్రోల్ చేస్తూ ఉంది అని చెప్పాలి.  నేటి రోజుల్లో టెక్నాలజీ పెరిగి పోయిన నేపథ్యం లో ప్రతి ఒక్కటి కూడా ఫోన్ లో అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఇక బయట ప్రపంచం తో పని లేకుండా పోయింది అని చెప్పాలి. ముఖ్యంగా నేటి రోజుల్లో మొబైల్ కి మంచి కెమెరాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యం లో ఎంతో మంది సెల్ఫీ పిచ్చి తో ఊగిపోతున్నారు.

 ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా చివరికి అక్కడ ఉన్న పరిసరాలను సెల్ఫీలలో బంధించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇలాంటి ప్రయత్నాలు చేసి ఎంతో మంది ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు  కూడా వెలుగులోకి వస్తున్నాయి. చివరకు సెల్ఫీ పిచ్చి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి. మరికొంతమంది సెల్ఫీ పిచ్చిలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పగలబడి నవ్వుకుంటారు అని చెప్పాలి.

 అరటిపండు తొక్క తిని పండు పడేయటం లాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి అన్నది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి చేతిలో చేపతో పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతను చేపను క్యాచ్ పట్టడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక ఆ క్షణాన్ని  సెల్ఫీ లో బంధించాలి అనుకున్నాడు. ఇక కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ తర్వాత చేపను నీళ్లలోకి వదిలేయాలి అనుకున్నాడు. కానీ చేప కి బదులు చేతిలో ఉన్న మొబైల్ విసిరేశాడు. చివరికి అతను తేరుకునే లోపే మొబైల్ నీళ్ళల్లో మునిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: