వైరల్ : విధిరాత అంటే ఇదే.. ఎలా చనిపోయాడో చూడండి?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఇటీవల కాలంలో అయితే మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది.  మనిషి ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పాలి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొంత మంది మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ  నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఏంటి అని కన్ఫ్యూజన్లో పడి పోతున్నారు కదా.. ప్రభుత్వం రహదారులను సరిగ్గా మరమ్మతులు చేయకపోవడం కారణంగా గుంతలు గతుకుల తో  కూడిన రోడ్లలో ఎంతోమంది వాహనాలు దారులు ఇబ్బందులు పడుతూనే ప్రయాణిస్తున్నారూ. కొన్ని కొన్ని సార్లు ఈ గతుకుల రోడ్డు కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతను సవ్యంగానే బైక్ నడుపుతున్నాడు. పక్కన వచ్చే వాహనదారులు కూడా తమ దారిన తాము వెళుతున్నారు. కానీ గతుకుల రోడ్డు అతని ప్రాణం తీసింది. ఇటీవలే మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరి గుండెలు ఝల్లుమనేలా చేస్తోంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారింది. ఇది చూసి నెటిజన్లు అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు అని చెప్పాలి. రోడ్డుపై ఉన్న గతుకుల కారణంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గణేష్ పాలే అనే వ్యక్తి బాలెన్స్ తప్పి కింద పడిపోయాడు.

 అదే సమయంలో దురదృష్టవశాత్తు వెనక నుంచి ఒక ట్రక్  వచ్చింది. అయితే ట్రక్ డ్రైవర్ కు అతను కనిపించలేదు. ఇంతలో అతని తల కింద పడింది. ఇంకేముంది సదరు వ్యక్తి పైనుంచి ట్రక్కు దూసుకుపోయింది. ఇక ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్ తో స్థానికుల అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: