వామ్మో.. మనుషులపై దాడి చేసే చేప!

Purushottham Vinay
ఇక సముద్రంలో అనేక చేపలు ఉంటాయి అనేది సాధారణమే.. ఆ చేపల్ని పట్టుకుని వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు చాలా మంది మత్స్యకారులు. అలా చేపలను మనుషులు వేటాడడం అనేది వెరీ కామన్.. కానీ మనుషులను కూడా చేపలు వేటాడుతాయని ఎప్పుడైనా విన్నారా..? ఇక అలాంటి ఓ చేపను ఈ మధ్యే సముద్రపు లోతులో కనుగొన్నారు కొందరు స్కూబా డైవర్లు.ఆ చేప చూసేందుకు మూడడుగులు పైనే సైజు ఉంటుంది అంటున్నారు. అది సింగిల్ గా ఉండదని ఇంకా ప్రత్యేకంగా గుంపులుగా ఉంటాయని కూడా చెబుతున్నారు. దీన్ని సముద్రంలో ఉండే అత్యంత ప్రమాదకారి చేపగా కూడా ప్రాధమికంగా గుర్తించారు. అంతటి డేంజర్ చేప మనదగ్గరే ఉందనే విషయం ఇప్పుడు వైరల్ అవుతూ కలవరపడేలా చేస్తోంది. ఇక విశాఖపట్నం నుంచి అటు ఉత్తరాంధ్ర వరకూ ఉన్న సముద్రపు లోతుల్లో కొందరు స్కూబా డైవర్లు ప్రస్తుతం స్కూబా అనేది చేస్తున్నారు. సముద్రంలో వింతైన జీవులు ఇంకా యాక్వా లైఫ్ పై పరిశోధనలు చేస్తుంటారు. కొన్ని సార్లు సముద్రంలో వింతైన అనుభవాలు కూడా వారికి ఎదురవుతుంటాయి. ఇంకా అలాంటి వాటిలో ఒకటే ఈ రాకాసి రకం చేప.ఇక ఈ చేపను గోలియత్ గ్రూపర్ అని అంటారు.. కొన్ని చోట్ల జోయ్ పిఫ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ పేరు పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయంటారు స్కూబా డైవర్ బలరాం నాయుడు.


గోలియత్ అనే డైవింగ్ ఏరియాలో ఉంటున్న దీనికి ఈ పేరు సరిపోతుందని కూడా అంటున్నారు. ఇలాంటి చేపని పసిఫిక్ సముద్రంలో చూశామని.. మళ్లీ అక్కడే దీన్ని చూస్తున్నామని అంటున్నారు. ఈ చేపకు మనుషులపై దాడి చేసే అలవాటు కూడా ఉందంటున్నారు.ఇక ఈ చేపలు దాడి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని బలరాం వివరించారు. డైవర్ షూప్యాడ్స్ కూడా లాగేసి దాడి చేసిన వైనాన్ని ఆయన కొన్ని వీడియోల ద్వారా కూడా చూపించారు. అలాగే వాటిని తమ వెబ్ సైట్ లో కూడా పొందుపరిచారు. ప్రధానంగా ఇవి సముద్రంలో మునిగిపోయి ఉన్న పాత షిప్ లు ఇంకా పెద్ద పెద్ద రాళ్ల వంటి ప్రాంతాల్లో ఉంటాయంటున్నారు.ప్రస్తుతం ఇక ఇవి ఉత్తరాంధ్ర నుంచీ తమ డైవింగ్ సైట్ కి మూడు నాటికల్ మైళ్ల దూరంలో ఓ షిప్ లో ఉన్నాయన్నారు. సముద్రం 23 మీటర్ల లోతులో వీటి ఆవాసాలు గుర్తించామని వారు చెప్పారు. అలాగే ఇక్కడి లోతులో ఇవి గుంపులుగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: