Viral : సముద్రంలో కోట్లు విలువ చేసే బంగారం గుర్తింపు!

Purushottham Vinay
సముద్ర గర్భంలో మనకు తెలియని వింతలు విశేషాలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు అపారమైన సంపద కూడా బయట పడుతూ ఉంటుంది. ఇక తాజాగా కూడా అలాంటి అపారమైన సంపద కూడా బయట పడింది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే.. సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించడం జరిగింది. దీని విలువ వచ్చేసి 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందుగా స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు.ఇక ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గర్భంలోని నాకల శిథిలాల కింద ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.1708 వ సంవత్సరంలో స్పానిష్ యుద్ధం అనేది జరిగింది. ఇక ఆ యుద్ధంలో బ్రిటీష్ నౌకలు జరిపిన దాడిలో సాన్ జోస్  అనే నౌక నీటి మునిగింది.ఇక ఆ నౌకలో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభరణాలు ఇంకా అలాగే బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే 2015 వ సంవత్సరంలో స్పానిష్ ప్రభుత్వం ఓడ నాశనానికి సంబంధించిన కొత్త ఫుటేజీని కొలంబియా అధికారులు విడుదల చేశారు.ఇక ఇందులో చెల్లాచెదురుగా విలువైన వస్తువులు కూడా ఉన్నాయి.


ఆ వీడియో రిమోట్ కంట్రోల్డ్ వాహనం ద్వారా పరిశీలించగా ప్రధాన ఓడ శిథిలాల పక్కనే ఒక పడవ కూడా ఉంది. ఈ రెండు నౌకలు కూడా 200 ఏళ్ల నాటివని వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో పేర్కొంది. ఇక రిమోట్‌తో నడిచే వాహనాన్ని కరేబియన్ తీరానికి 3,100 అడుగుల లోతుకు పంపినట్లు తెలిపింది.ఇందుకు సంబంధించిన చిత్రాలు కనుక చూస్తే.. నీలం, ఆకుపచ్చ రంగులలో అవి ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న బంగారు నాణేలు, కుండలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్న పింగాణీ కప్పులను కూడా అధికారులు గుర్తించారు. వివిధ రకాల మట్టి కుండలతో పాటు సముద్రగర్భంలో ఫిరంగి కూడా ఉన్నట్లు వారు గుర్తించారు. నావికాదళం ఇంకా అలాగే ప్రభుత్వానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు శాసనాల ఆధారంగా వాటి మూలాన్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నారని అక్కడి కొలంబియా అధికారులు తెలిపారు. అయితే వాటిని వెలికి తీసి శాన్ జోస్ గ్యాలియన్ వారసత్వ సంపదను రక్షిస్తామని ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్ కూడా అన్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: