వైరల్ : పెళ్లిలో అద్భుతంగా పాట పాడిన వైసీపీ ఎమ్మెల్యే?

praveen
ఇటీవలికాలంలో పెళ్లిళ్లకు ప్రజాప్రతినిధులను పిలిపించుకోవడం కామన్ గా మారిపోయింది. ఇక అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వస్తే ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు పెళ్లి చేసుకునే నూతన వధూవరులు. ప్రజాప్రతినిధులు కూడా తమ పార్టీకి చెందిన కార్యకర్తలు పెళ్లిళ్లు అయితే ఇక ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి పెళ్లిళ్లకు వెళ్లి ఆశీర్వదించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదించి రావడం సర్వసాధారణం. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు ఇలా పెళ్లిళ్లకు హాజరైన సమయంలో ఏకంగా అక్కడ బంధువులు అందరితో కలిసి కాస్త ఎంజాయ్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.

 డీజే పాటలు పై స్టెప్పులు వేసి అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఉత్సాహపర్చటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఇలా పలువురు ఎమ్మెల్యేలు శుభకార్యాలలో డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు డాన్స్ చేయడం చూశాము కానీ ఏకంగా ఆర్కెస్ట్రా గ్రూప్ తో కలిసి ఒక అదిరిపోయే పాట పాడటం ఎవరు చూసి ఉండరు. కానీ ఇక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం తనలోని టాలెంట్ ని బయట పెట్టాడు.

 విశాఖలోని చోడవరం కి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇటీవలే సింగర్గా అవతారమెత్తాడు. విశాఖ నగరంలో జరిగిన తన కుమార్తె వివాహ వేడుకలో అందరికీ పాటలతో అలరించడానికి ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ ని పిలిపించాడు. అయితే వాళ్ళు పాటలు పాడుతున్న సమయంలోనే తాను కూడా స్టేజి మీదికి చేరుకొని గొంతు సవరించాడు. నాయకుడిగానే కాదు గాయకుడిగా కూడా తనలో ఉన్న టాలెంట్ అందరికీ నిరూపించాడు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.  నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాడిన పాట అక్కడున్న బంధువులందరిని కూడా అలరించింది అని చెప్పాలి.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: