వ్యాక్సిన్ వేయించుకోండి.. వెకేషన్ కు చెక్కేయండి

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చేసింది. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా అయితే ఈ టైంలో అనేకమంది పక్కదేశాలకు ఇప్పటికే వెకేషన్ కు చెక్కేసేవాళ్ళు. కానీ ఈ ఏడాది కరోనా పుణ్యమా అని ఏ దేశం కూడా టూరిస్టులను అనుమతించడం లేదు. దీంతో వెకేషన్ కోసం చేసుకున్న ప్లాన్స్ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు వెకేషన్ ప్రియుల కోసం కొన్ని దేశాలు మంచి బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి.
వేసవిలో విదేశాలకు వెళ్లి, అక్కడ సేదతీరాలనే కోరిక చాలమందికి ఉంటుంది. కానీ కెజివిడమ్ అయితే వాటి గురించి ఇక చింతించాల్సి అవసరం లేదు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే చాలు.. బ్యాగులు ప్యాక్ చేసుకుని ప్రయాణానికి రెడీ అవొచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
7 చాలా దేశాలు.. పర్యాటక రంగం ద్వారా తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటలను ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నాయి. విదేశీ టూరిస్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా సీషెల్స్, థాయ్‌లాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు మందు వరసలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో కూడా సీషెల్స్ ప్రథమ స్థానంలో ఉంది.
సీషెల్స్:
విదేశీ పర్యాటలకు ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ జనవరిలోనే స్వాగత ద్వారాలు తెరిచింది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులకు తమ దేశంలో క్వారెంటైన్‌ నిబంధనలు వర్తించవని ప్రకటిచింది. వ్యాక్సిన్ వేసుకున్నట్టు సంబంధిత హెల్త్ అథారిటీ నుంచి ధ్రువీకరణ పత్రం, కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తే తమ దేశంలో స్వేచ్ఛగా పర్యటించొచ్చని పేర్కొంది.
థాయ్‌లాండ్:
థాయ్‌లాండ్‌ కూడా‌ విదేశీ టూరిస్ట్‌లకు స్వాగతం పలుకుతోంది. విదేశీ పర్యాటకులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలనే నిబంధన థాయ్‌లాండ్‌లో అమలవుతోందN దీన్ని థాయ్‌లాండ్‌కు చెందిన ఫుకెట్ ఐలాండ్ కొద్ది రోజుల క్రితం ఎత్తేసింది. వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటలు 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. తాజాగా ఇదే బాటలో కో స్యామ్యూయీ అనే ఐలాండ్ కూడా నడిచింది. వ్యాక్సిన్ వేయించుకున్న విదేశీ టూరిస్ట్‌లకు క్వారెంటైన్ నిబంధలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
గ్రీస్:
వ్యాక్సిన్ పొందిన అంతర్జాతీయ ప్రయాణికులను మే 14 నుంచి  తమ దేశంలోకి అనుమతిస్తామని గ్రీస్ ఓ ప్రకటలో వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ పొందినట్టు ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుందని చెప్పింది. ధ్రువపత్రం లేనట్టయితే కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ అయినా సమర్పించొచ్చని వివరించింది.
రొమేనియా:
కొవిడ్ తీవ్రతను బట్టి ప్రపంచ దేశాలను రొమేనియా రెండు వర్గాలుగా విభజించింది. అత్యధిక ప్రమాదకర రీతిలో కేసులు నమోదవుతున్న దేశాలను రెడ్ లిస్ట్‌లో, మహమ్మారి ప్రభావం తక్కువగా ఉన్న దేశాలను ఎల్లో లిస్ట్‌లో చేర్చింది. ఎల్లో లిస్ట్‌లో దేశానికి చెందిన విదేశీ పర్యటకులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే.. వారు తమ దేశంలో క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని తాజాగా
వెల్లడించింది.
 
జార్జియా:
వ్యాక్సిన్ పొందిన విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ జార్జియా గత నెలలోనే ప్రకటన విడుదల చేసింది. ఏదేశ పౌరుడైనా.. వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే.. వారు తమ దేశంలో పర్యటించొచ్చని జార్జియా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఎస్టోనియా:
కరోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ పొందిన విదేశీ పర్యటకులకు 10 రోజుల క్వారెంటైన్ నిబంధన, కరోనా నెగెటివ్  సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపునిస్తూ ఎస్టోనియా గత నెలలో ప్రకటించింది. అయితే సదరు పర్యాటకులు కరోనా నుంచి కోలుకుని /వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలు దాటి ఉండకూడదని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: