బుల్లిపిట్ట: ఇలా చేస్తే మొబైల్ సిగ్నల్ లేకుండా కాల్స్ మాట్లాడవచ్చు..!

Divya
ఇప్పుడు ఎక్కువగా టెలికాం దిగ్గజం కంపెనీ సంస్థలు తమ నెట్వర్క్ సిగ్నల్ పైన దృష్టిపెట్టలేదు కాబోలు.. సిగ్నల్ సరిగ్గా లేకుండా ఉండటం జరుగుతోంది. తక్కువ సిగ్నల్స్ ఉండటం కారణంగా ఫోన్ కాల్స్ కలవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ అలా కాల్ కలిసిన మధ్యలోనే సిగ్నల్ లేక డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. లేదంటే అవతల వ్యక్తి మాటలు సరిగ్గా వినిపించకపోవడం వంటి సమస్యలు మనకి ఎదురవుతూనే ఉన్నాయి.
అయితే ఈ సమస్యలన్నిటికీ కేవలం ఈ విధంగా చెక్ పెట్టవచ్చునని కొంతమంది టెక్నికల్ సమస్త వారు తెలియజేశారు. అది ఎలా అంటే వైఫై కాలింగ్ ద్వారా వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చునని తెలియజేశారు. దీనికి నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా అందుకున్న చాలా తక్కువ ఉన్న మనం ఎలాగైనా కాల్స్ మాట్లాడుకోవచ్చు. వైఫై కాలింగ్ సహాయంతో చేసిన కాల్స్ మనం డిస్కనెక్ట్ చేస్తేనే ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుందట.
ఇక మరొక బెనిఫిట్ ఏమిటంటే మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయట. ఇక వీటిపై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఇక అయితే ఈ ఫ్యూచర్ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో చిన్న సెట్టింగ్ చేస్తే చాలు..
1).ముందుగా మన మొబైల్ లోని సెట్టింగ్ ఆప్షన్ కి వెళ్లి ఆ తర్వాత నెట్వర్క్ కనెక్షన్ పై క్లిక్ చేయాలి.
2). అలా చెక్ చేసిన తర్వాత వైఫై అనే ఆప్షన్ ను ఓపెన్ చేయాలి . అందులో అడ్వాన్స్ ఆప్షన్ ను ఓకే చేయవలసి ఉంటుంది.
3). అలా చేసిన తర్వాత మన స్క్రీన్ మీద వైఫై కాలింగ్ అని ఆప్షన్ ను అందుబాటులో ఉంచుతుంది. వాటిని మనం యాక్టివ్ చేసుకుంటే సరిపోతుంది.
4). ఇప్పుడు ఎక్కువగా డ్యూయల్ సిమ్ భలే కాబట్టి మనం ఏసి ఆప్షన్ నుంచైనా ఎంచుకోవచ్చు.
ఇక ఈ సెట్టింగ్ కేవలం ఆండ్రాయిడ్ మొబైల్స్ కు మాత్రమే. ఇక ఐఫోన్ వంటి మొబైల్స్ కైతే డేటా ఆప్షన్ లోకి వెళ్లి ఈ ఫ్యూచర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: