వారానికొకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి.. ఎందుకో తెలుసా?
ఈ క్రమంలోనే ఇక హాకర్లు కూడా రెచ్చిపోతూ మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తూ ఏకంగా కీలక సమాచారాన్ని దొంగలిస్తున్నారు. అయితే హ్యాకర్ల చేతికి మొబైల్ చిక్కకుండా ఉండాలి అంటే ఇటీవలే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఒక సూచన చేసింది. లాప్టాప్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా స్లో గా ఉన్నప్పుడు సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం లాంటివి చేస్తారు. అలాగే మొబైల్ ని కూడా వారానికి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఎంతో మంచిది అంటున్నారు. ఇక తరచూ చేసినా కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొద్దు అని సూచిస్తున్నారు.
మొబైల్ ఉపయోగిస్తున్న సమయంలో బ్లూటూత్ను డిసేబుల్ చేయాలి.
* ఫ్రీగా వస్తుంది కదా అని పబ్లిక్ వైఫై నెట్వర్క్లను అస్సలు ఉపయోగించకూడదు . అనవసరంగా వైఫై ఆప్షన్ ను ఆన్ లో పెట్టకూడదు.
* ఏదిపడితే అది కాకుండా మీ మొబైల్ లో కేవలం ఎక్కువగా అవసరం అయినవి మాత్రమే అంటే వీలైనంత తక్కువ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్.. డౌన్లోడ్ చేసిన యాప్ l లకు వ్యక్తిగత సమాచారం ఇచ్చే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండటం మంచిది.
* మొబైల్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ , యాప్స్ను వీలైనంత త్వరగా అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల అటు మొబైల్ పర్ఫామెన్స్ కూడా బాగుంటుంది .
* ఇక మీ మొబైల్ మరింత సురక్షితంగా ఉండేందుకు ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఫీచర్లు వాడుకోవడం బెటర్ .
* ఇక కీలకమైన సమాచారాన్ని ఆటోమొబైల్ ఫోన్లో భద్రపరుచుకోకపోవటమే ఎంతో మంచిది.
* ఏది పడితే అది కాకుండా కేవలం ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్ ని మాత్రమే ఉపయోగిస్తే మంచిది.