బుల్లి పిట్ట : ఈ కారుకు ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు..600 km ప్రయాణం..

Divya
ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ మయం. అందుచేతనే ఇప్పుడు వాహనాలు కూడా ఎలక్ట్రానిక్ వైపే వస్తున్నాయి.ఇక ఈ  ఎలక్ట్రానిక్ వాహనాల పైనే  మొగ్గుచూపుతున్నారు ప్రజలు.ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కార్ల సంస్థ"టెస్లా"ఈ సంవత్సరంలో భారతదేశ మార్కెట్ లో  ఒక కారును విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ కారు యొక్క విశేషాలు దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఈ టెస్లా కారు మోడల్ 3 అనే పేరుతో విడుదల కానుంది, అంతేకాకుండా ఈ కార్ కు  డ్యూయల్ మోటర్ సదుపాయం కలదు. ఈ కార్లు బేసిక్ మోడల్ 3 మాత్రం పూర్తి ఛార్జింగ్ చేస్తే 423 కిలోమీటర్ల వరకు వెళుతుంది. అంతేకాకుండా ఈ కారు 6 సెకన్లలో 0-100 K.M వేగాన్ని తాకుతుంది. ఇక ఇందులో టాప్ మోడల్ -3 అయితే ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 586-600 K.M వరకు వెళుతుందట. ఇక ఇది 3  సెకండ్లలో 0-100 స్పీడ్ వేగాన్ని అందుకోగలదు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. ఈ కారును ఆపరేటింగ్ చేయాలంటే ఎటువంటి తాళం అవసరం ఉండదు. ఎందుచేత అంటే ఆండ్రాయిడ్, IOS మొబైల్ సహాయంతోనే దీనిని ఆపరేటింగ్ చేయవచ్చు. మన మొబైల్ లో ఈ సిస్టమ్ ఆపరేటింగ్ సెట్టింగ్ చేసుకొని కారు దగ్గరకు వెళ్లగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్  అండ్ బ్లాక్ అవుతాయి.
దాదాపుగా 2 సంవత్సరాల క్రితం tesla -3 మోడల్ అనే కారుకు నిర్వహించిన యూరో ACNAC టెస్టింగ్ డ్రైవ్ లో పూర్తిగా 5/5 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు వదిలిన ఈ కొత్త మోడల్ కు  కూడా ఇంతే రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ కార్ ను మొట్టమొదటిగా భారతదేశంలో విడుదల చేయానున్నారు. ఈ కారు ( CBU) అనే సంస్థ ద్వారా భారత దేశంలోకి అడుగుపెట్టనుంది. దీని ధర అక్షరాలా రూ. 70 లక్షలు ఉండవచ్చు.
ప్రస్తుతం యుఎస్ఎలో ఈ మోడల్ కార్ ధర ($39,990)రూ. 30 లక్షల వరకు అమ్ముతున్నది. ఈ కారణం అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల అత్యధికంగా సూపర్ పన్నును విధించడం వల్ల ఇది  మన దేశములో రూ.70 లక్షలకు వచ్చే అవకాశం ఉంది. ఈ కారును ఇప్పటికే ముకేశ్ అంబానీ, ప్రశాంత్ రుమా వంటి వారు కొనుగోలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: