టీవీ: నేను నరకంగా దెబ్బతిన్నా.. అనసూయ..!!

Divya
తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది అనసూయ. నిరంతరం ఏదో ఒక విధంగా ఎప్పుడు ట్రోల్ అవుతూ ఉంటుంది.జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సమానంగా సోషల్ మీడియాలో కూడా పలు క్రేజ్ ను సంపాదించుకుంది. అనసూయ యాంకర్ గా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వేసే గ్లామర్ దుస్తులలోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే స్టేజ్ పైన తన మీద వచ్చే నెగటివ్ పాజిటివ్ వంటి వాటిపైన కూడా చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది అనసూయ.
గడచిన కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంది. అందుకు కారణం తన మీద వచ్చే బాడీ షేమింగ్స్ అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. అలా సుడిగాలి సుదీర్ తో సూపర్ సింగర్ జూనియర్ షో కి యాంకర్ గా చేసింది. అయితే ప్రస్తుతం  యాంకర్ గా ఎలాంటి షోలు లేకుండా ఖాళీగానే ఉన్నట్లుగా తెలియజేస్తోంది. పలు చిత్రాలలో మాత్రం బిజీగా  ఉన్నట్లు సమాచారం అనసూయ. అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకుంటూ.. నేను నరకంగా దెబ్బతిన్న.. నేను గాయపడిన విధంగా ఎవరిని బాధ పెట్టను.. అని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ గా మారుతోంది.దీంతో అనసూయ అభిమానులు అనసూయ ఎవరిని ఉద్దేశించి ఇలా షేర్ చేసింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చివరిగా ఇది వరల్డ్ కొటేషన్ నుంచి తీసుకొని పోస్ట్ చేయడం విశేషం అని చెప్పవచ్చు. వాస్తవానికి అనసూయ పైన సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయంలో అనసూయ ఎన్నోసార్లు బాధపడినట్లుగా తెలియజేసింది ఇప్పుడు ఈ విషయం పైన రియాక్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: