టీవీ: హీరోయిన్ పూర్ణ ప్రేమలో ఓడి పోయిందా.. నిజమేనా..?

Divya
ప్రేమించిన వారితో జీవితాంతం ఉండడం ఒక అదృష్టం గా అందరూ భావిస్తూ ఉంటారు. ఇక ఇవే మాటలు ఇప్పుడు తాజాగా హీరోయిన్, జడ్జ్ అయిన పూర్ణ నోటి నుండి మాటలు వెలుబడ్డాయి. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా ఈమె కనిపిస్తోంది. నటి ఇంద్రజ స్థానంలో పూర్ణ రావడం జరిగింది గత కొన్ని వారాల నుంచి ఈమె ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో ఢీ షో ని మానేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈమె కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ షోకే సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె వసించును చూసి తెగ ఎమోషనల్ అయ్యింది.

ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్లలో నూకరాజు, ఆసియా, శాంతి కుమార్ తో కలిసి ఒక స్కిట్ చేయడం జరిగింది. ఈ స్కిట్ ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. స్కిట్ లో భాగంగా ఒక విషాద ప్రేమ కథని చూపించారు. ప్రేమించి వివాహం చేసుకుంటే పరువు హత్యకు గురి అవుతున్న ఒక జంట ఎలా ఉంటుంది అనే వాటిని స్కిట్ రూపంలో చూపించారు. ఇక ఈ స్కిట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కదిలిపోయారు స్కిట్టు అనంతరం రష్మీ అయితే చాలా ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో ఎవరు రైటు చెప్పలేము చాలా కష్టమైన పరిస్థితి అని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి విషయాలలో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో చెప్పలేమనే విషయాన్ని తెలియ జేసింది. కానీ ఇలా హత్యలు చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే అని తెలియజేసింది పూర్ణ. ప్రేమించిన వాళ్ళ తో జీవితాంతం కలిసి ఉండడం చాలా అదృష్టం అది అందరికీ దొరకదు. అయితే ఇక్కడ మాత్రం అలా వివాహం చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు వారందరికీ కంగ్రాట్స్ అని తెలియజేసింది పూర్ణ. ఆమె మాటలు వింటుంటే మరికొంతమంది ఈమె కూడా బ్రేకప్ స్టోరీ ఉన్నట్లుగా ఉంది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఒక దుబాయ్ వ్యాపారవేత్త వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: