టీవీ: జబర్దస్త్ తీసి వేస్తున్నారు అనే వార్తలపై మల్లెమాల రియాక్షన్ ఇదే..!!

Divya
తెలుగు బుల్లితెరపై కామెడీ షో గా బాగా గుర్తింపు పొందిన ది జబర్దస్త్ షో. గత కొన్ని వారాలుగా ఈ షో ని జనాలు పట్టించుకోవడం లేదు అనే టాక్ బాగా వినిపిస్తోంది. ఈ సమయంలో జబర్దస్త్ కామెడీ షో ను క్లోజ్ చేయబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే ఉండబోతోంది అన్నట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా చేస్తున్నారు ఈ విషయాన్ని. దీంతో జబర్దస్త్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో అత్యధిక టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న ఇ షో నిలిపివేయడం ఏంటి అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ .

అద్భుతమైన జబర్దస్త్ కార్యక్రమం లో ఈ మధ్యకాలంలో మల్లెమాల వారు అసలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో కమెడియన్ పలువురు కూడా ఈ షోకు దూరమయ్యారని ముఖ్యంగా సుధీర్ హైపర్ ఆది ,గెటప్ శీను వంటి వారు దూరం కావడంతో ఇందుకు టిఆర్పి రేటింగ్ చాలానే పడిపోయింది ఇక అనసూయ కూడా జబర్దస్త్ కు దూరం అయింది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ విషయంపై మల్లెమాల  స్పందించడం జరిగింది.
జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికి కూడా రేటింగ్ లో బాగా దూసుకుపోతోంది ఈ షోలో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికీ ఎలాంటి మార్పు జరగదని తెలియజేసింది. ఎంతమంది వెళ్లి పోయినా సరే కొత్తవారు వస్తూనే ఉంటారు కొత్తవారితో ఖచ్చితంగా ముందుకు నడిపిస్తూ ఉంటామని తెలియజేశారు. ప్రతి ఒక్క ఫో కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలానే ఇప్పుడు జబర్దస్త్ కు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ మంచి రేటింగ్ ను సంపాదించుకొని నెంబర్ వన్ గా నిలుస్తుందని తెలియజేశారు. ఇప్పటివరకు కూడా మరి ఛానల్ ఎక్కువ షోలు కూడా అంతగా సక్సెస్ కాలేదు అంటూ కామెంట్లు చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: